గుంటూరు, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు అధ్యక్షతన సోమవారం జనతా పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ షేక్ సాంబశివరావు ఆధ్వర్యంలో లవ్ జిహాద్ బాధితులకు న్యాయం చేయాలి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పి.జి.ఆర్.ఎస్ లో వినతి పత్రం ఇవటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లవ్ జిహాద్ లు సాధిక్ ఖాన్ మోసపోయిన ఏఈ కుటుంబం అలాంటి సన్నివేశాలు దేశంలో రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్నప్పటికీ అవి బయటకు రాకపోవడం మరియు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన వాటిని పట్టించుకోకపోవడం వలన ఎంతోమందికి అన్యాయం జరుగుతుందని బీజేపీ నాయకులు అన్నారు. ఇలాంటి లవ్ జిహాద్ జరిగిన ప్రదేశాన్ని గుర్తించి వారికి అండగా ఉండి వారికి న్యాయం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కి విన్నవించడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ అబ్రహం, బిజెపి గుంటూరు జిల్లా సెక్రెటరీ దానబోయిన శివయ్య, 12వ మండల ఉపాధ్యక్షులు భార్గవ, కార్యకర్తలు మరియు సభ్యులు పాల్గొన్నారు.


