గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వరల్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలయన్స్ (డబల్యుపిఈఏ) సభ్యత్వం లభించింది. సంబంధిత ధ్రువపత్రాన్ని కార్యనిర్వాహక సంచాలకులు పి.పి.ఎస్ బాలకుమార్, ఏఎన్యూ ఉపకులపతి గంగాధరరావుకు అందజేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, క్రీడలు, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి డబల్యుపిఈఏ వేదికగా పనిచేస్తుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు, సిలబస్ రూపకల్పనలో ఏఎన్యూ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ సభ్యత్వం లభించిందని వీసీ గంగాధరరావు తెలియజేశారు.


