Thursday, September 10, 2026
spot_imgspot_img

ఎల్.కోటకు సీఎం నారా చంద్రబాబు నాయుడు రాక

Must read

📰 Generate e-Paper Clip

ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

ఎల్.కోట, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఎస్.కోట (ఎల్.కోట) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె వివాహం ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా విచ్చేసి వధువును ఆశీర్వదించనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని అధికారులు, పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు భద్రత మరియు ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ స్వయంగా పర్యటించి హెలీప్యాడ్ ప్రాంతాన్ని, ముఖ్యమంత్రి కాన్వాయ్ మార్గాలను మరియు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎటువంటి భద్రతా లోపాలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.