ప్రత్తిపాడు, 01 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, పార్లమెంట్ సభ్యులు భాష్యం రామకృష్ణ, ప్రత్తిపాడు శాసన సభ్యులు డా.బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ వట్టిచెరుకూరులో మంగళవారం పంపిణీ చేశారు.
120 సంవత్సరాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం
ప్రత్తిపాడు నియోజక వర్గంలో 120 సంవత్సరాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. నియోజక వర్గంలోని వట్టిచెరుకూరు, పుల్లటగుంట, ఏటుకూరు గ్రామాల్లో 812 కుటుంబాలకు శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మూడు గ్రామాల్లో 41.46 ఎకరాలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
120 సంవత్సరాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం


