పుణె, 01 ఆగస్టు 2026 : అంతర్జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్మాన్య తిలక్ జాతీయ అవార్డును అందజేశారు. పుణెలో బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశ భద్రత, కౌంటర్ టెర్రరిజం, బోర్డర్ సెక్యూరిటీకి దోవల్ చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందించారు.ఈ అవార్డులో మెమొంటో, ప్రశంసా పత్రం, లక్ష నగదు బహుమతి ఉంటాయి. దోవల్ ఇంటెలిజెన్స్, నేషనల్ సెక్యూరిటీ రంగాల్లో సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు.


