తెలంగాణ, 29 జులై 2026, భారత్ ప్రతినిధి : ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను కాంగ్రెస్ బీఎల్ఏలు వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్పై జిల్లా ఇన్చార్జ్, జిల్లా పీసీసీలతో చర్చించి ముగ్గురు సభ్యులతో ప్యానల్ ఏర్పాటు చేసి నివేదిక అందించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని సూచించారు. బీఎల్ఏలు(BLA) బాగా పనిచేస్తున్నారని అభినందించారు. ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఈరోజు జరిగిందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


