గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారత శరీర అవయువ దాతల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీన గుంటూరులో జాతీయ, అంతర్జాతీయ ఆర్గాన్ డొనేషన్ డే వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3వ తేదీన నగరంలో అవగాహన ర్యాలీ, సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమణ యసశ్వీ, మెంబర్ రాధారాణి తెలిపారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరావతి రోడ్ హిందూ ఫార్మసీ కళాశాల వరకు ప్రదర్శన సాగుతుందని అన్నారు. మరణించినా జీవించండి అనే నినాదంతో ఆర్గాన్ డొనేషన్ పై గుంటూరులో 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు వెల్లడించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారు అవయువాలు దానం చేస్తే మరో ఎనిమిది మందికి పునర్ జన్మను ఇవ్వొచ్చు అని చెప్పారు. అవయువ దానం పట్ల యువత అవగాహన పెంచుకోవాలని సూచించారు. అపోహలు తొలగించుకుని జీవన్ ధాన్ పధకంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
అఖిల భారత శరీర అవయువ దాతల సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 3న ఆర్గాన్ డొనేషన్ డే వేడుకలు


