నేడు వైయస్సార్ 17 వర్ధంతి
అమరావతి, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మరణించిన కూడా పేద వారి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన నాయకుడు వై యస్ రాజశేఖరరెడ్డి. నేడు (సెప్టెంబర్ 2) వైయస్ఆర్ 17వ వర్ధంతి సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
దివంగత మహానేత , అపర భగీరదుడు, పేదల పెన్నిధి డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు, పేదవాడికి విద్య, వైద్య, సాగునీటి రంగాల్లో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను నాయకుల అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


