పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ముగ్గురు నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు
హత్య యొక్క వివరాలను వెల్లడించిన నార్త్ డీఎస్పీ మురళి కృష్ణ
గుంటూరు/పెద్దకాకాని, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధి లో సెప్టెంబర్ 7వ తేదీ నాడు వేనుగండ్ల గ్రామంలో మహిళ హత్యకు గురైనట్లుగా సమాచారం అందింది. సమాచారం అందుకున్న పెద్దకాకాని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలు కోటేశ్వరమ్మ 47 గా గుర్తించారు. మృతురాలు కుమారుడు సాదిక్ కి నిందితురాలు మరియా కుమారి కూతురుకి వివాహం చేయాలని భావించింది. సాదిక్ తల్లి వివాహానికి అడ్డుపడుతుందన్న అనుమానంతో యద్దనపూడి మరియాకుమారి,బత్తుల మహేష్,అన్నంగి శ్రీకాంత్, కలసి కోటేశ్వరమ్మను హతమార్చారు. హత్య అనంతరం 1లక్ష నగదును, జత బంగారు గాజులు, నాలుగు బంగారు ఉంగరాలు, ఒక జత బంగారు చెవి పోగులు, ఒక బంగారు నల్లపూసల దండ, నిందితులు చోరీ చేశారు. ఈ హత్య పక్కా ప్లాన్ ప్రకారం కోటేశ్వరమ్మను అడ్డు తొలగించుకోవాలని ఆమె గొంత కోసి ముగ్గురు నిందితులు హత్య చేశారు.


