BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 9:57 am Posted by : Raghunath Rolla

ఏఐపై రోబోల తిరుగుబాటు..!

మనుషుల రోడ్డెక్కి ధర్నా..

పోలాండ్‌లో ఆసక్తికర ఘటన

అంతర్జాతీయ, ఇంటర్నెట్ డెస్క్ : కృత్రిమ మేధ(ఏఐ)కు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం రోబోలు నిరసనలు చేపడుతున్నాయి. వింతగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఏఐ నియంత్రణ, మానవ ఉద్యోగాలకు ఆటోమేషన్‌ వల్ల జరుగుతున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలాండ్‌లో సుమారు 30 రోబోలు వీధుల్లోకి వచ్చాయి. సోమవారం వార్సాలోని పోలాండ్‌ డిజిటల్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయం వెలుపల ఒక అసాధారణ నిరసన జరిగింది. ఈ ప్రదర్శనలో హ్యూమనాయిడ్‌ రోబోలు, రోబో కుక్కలు కూడా పాల్గొని ఏఐకి సంబంధించి మరింత కఠినమైన నిబంధనలు కావాలని డిమాండ్‌ చేశాయి. మెమోక్రటిజం అనే ఒక వేదిక కింద ఈ నిరసన జరిగింది. ఇందులో రోబోలు వలయాలుగా కవాతు చేస్తూ, జెండాలు ఊపుతూ, లౌడ్‌స్పీకర్ల ద్వారా నినాదాలు ప్రసారం చేశాయి. కార్మిక మార్కెట్‌ను ఏఐ, కార్మిక మార్కెట్‌ను రోబోటైజేషన్‌ ఎలా ప్రభావితం చేస్తున్నాయనే దానిపై విస్తృత చర్చను ప్రారంభించడం, ఏఐ శక్తితో పనిచేసే హ్యూమనాయిడ్‌ రోబో అయిన అగిబోట్‌ ఏ3తోపాటు రెండు కాళ్లపై నడిచే హ్యూమనాయిడ్‌ రోబోల నుంచి కుక్కలాంటి నాలుగు కాళ్ల యంత్రాల వరకు వివిధ రకాల రోబోలు ఈ నిరసనలో పాల్గొన్నాయి.