కర్నూల్‌లో దారుణం.. శానిటేషన్‌ వర్కర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

కర్నూల్‌, 06 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీలోని కర్నూల్‌లో దారుణం చోటు చేసుకుంది. పారిశుధ్య కార్మికురాలిపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన స్థలానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. కాగా, రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. ఆదివారం ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన...