BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 7:47 am Posted by : Yaddanapudi Arudra

మంగళగిరిలో ప్రారంభమైన ‘లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో రెండు రోజుల ‘లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ ప్రారంభమైంది. తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్తో కలిసి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.