BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 5:48 pm Posted by : Raghunath Rolla

జి.ఎం.సి కమిషనర్ ను అభినందించిన కలెక్టర్

గుంటూరు, 09 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’ 2026లో గుంటూరు నగరం ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును అందుకున్న గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ను బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు. దేశ వ్యాప్తంగా 130 నగరాల మధ్య జరిగిన పోటీలో గుంటూరు నగరం పట్టణాల కేటగిరిలో ద్వితీయ స్థానంలో  నిలవడం గర్వకారణం అన్నారు. రాష్ట్ర స్థాయి కేటగిరీ 2 లో జిఎంసి తొలి స్థానంలో నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో కృషి చేస్తూ మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాక్షించారు. గ్రీన్ గుంటూరు, నవ గుంటూరును సాధించి ప్రజల మనసులో నిలవాలని అన్నారు.