ఐదుగురుపై కేసు నమోదు
కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 5:00 సమయంలో గండేపల్లి ఎస్సై వారి సిబ్బందితో గండేపల్లి లో వెహికల్ చెకింగ్ చేసుండగా టీజీ 12 T 4906 నెంబర్ గల లారీలో కొత్తవలస నుండి చిలకలూరిపేటకు ఎటువంటి ప్రాథమిక సదుపాయాలు (ఆహారం, నీరు) లేకుండా, అత్యంత ఇరుకుగా బంధించి, హింసిస్తూ గోవధ కోసం అక్రమ రవాణా చేస్తున్న ఇరవై రెండు ఎద్దులను స్వాధీనం చేసుకొని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఇరవై రెండు ఎద్దులను సంరక్షణ నిమిత్తం వాటిని సమీపంలోని గోశాలకు క్షేమంగా తరలించారు. ఈ కేసును గండేపల్లి ఎస్సై యువి శివ నాగబాబు దర్యాప్తు చేస్తున్నారు.