అమరావతి, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా క్యాబినెట్ హోదాతో ప్రమాణస్వీకారం చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ శాసనమండలి సభ్యుడు కొణిదెల నాగబాబును విన్నకోట సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అమరావతిలో శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా నాగబాబును కలిసి పుష్పగుచ్ఛం అందించిన విన్నకోట సురేష్, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని విస్తరించి, ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే మహత్తర లక్ష్యంతో AP-GREEN ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నాగబాబు నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యం లభించడంతో పాటు, పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఊపుతో విస్తరించాలని విన్నకోట సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో AP-GREEN ప్రాజెక్టు ఆదర్శవంతమైన ఫలితాలు సాధించి, రాష్ట్ర పర్యావరణ రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకాలని కోరుకున్నారు. నాగబాబు తన సమర్థవంతమైన నాయకత్వంతో ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని విన్నకోట సురేష్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.