BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 6:44 pm Posted by : BHARATH PRATHINIDHI

గుంటూరు నగరపాలక సంస్థలో ఉద్యోగుల బదిలీలు

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జీఎంసీ పరిపాలనా అవసరాల దృష్ట్యా 12 మంది ఉద్యోగులకు బదిలీలు, పోస్టింగ్లు, ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ కె. మయూర్ అశోక్ తక్షణం అమలు జరిగేలా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఏడుగురిని వివిధ విభాగాలకు బదిలీ చేయగా, మరో ఐదుగురికి కొత్త పోస్టింగ్లు, ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. సి -సెక్షన్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, ఎడ్యుకేషన్, ఎలక్షన్ తదితర విభాగాల్లో ఈ మార్పులు చేశారు.