మాగండ్లపల్లి, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మాగండ్లపల్లి రెవెన్యూ గ్రామం–మద్దనపల్లె గ్రామానికి చెందిన 29 మంది రైతుల భూములపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అసలు హక్కుదారులకు న్యాయం చేయాలని కోరుతూ, బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ శ్రీమతి చల్లా కళ్యాణి ఐఏఎస్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు, పుంగనూరు నియోజకవర్గ నాయకులు, రైతులు, కార్యకర్తలు మరియు స్థానిక హక్కుదారులు పెద్ద ఎత్తున పాల్గొని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు హక్కుల పరిరక్షణే బీసీవై పార్టీ లక్ష్యం. అసలు హక్కుదారులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని బీ సీ వై పార్టీ అన్నమయ్య జిల్లా కమిటీ కోరింది.