అభివృద్ధి కార్యక్రమాలపై గుంటూరు కలెక్టర్‌ సి.యం. సాయి కాంత్ వర్మ సమీక్ష

గుంటూరు, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నందున, నిర్నీత షెడ్యూల్ ప్రకారం ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ సి యం సాయి కాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రెవెన్యూ అంశాలు, ఆధార్‌ కార్డులు లేని యానాది కుటుంబాల గుర్తింపు, గ్రీన్‌ గుంటూరు, క్రాప్‌ ఇన్సూరెన్స్‌,...