BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 2:35 pm Posted by : BHARATH PRATHINIDHI

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై పూర్తి నిషేధం : జిఎంసి కమిషనర్

గుంటూరు, 24 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం అమలులో ఉందని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మయూర అశోక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్లాస్టిక్ నిషేదంపై ప్రజారోగ్య అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు నిరంతరం క్షేత్ర స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై ‘స్వచ్ఛ యాప్’ ద్వారా తక్షణమే అపరాధ రుసుం విధించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టం తెలుసుకొని సహకరించాలని ఆయన కోరారు.