గుంటూరు, 01ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా పోలీసు కార్యా లయంలో 2023 గ్రూప్-1 ట్రైనీ అధికారులకు ప్రాక్టికల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొని శాంతిభద్రతలు, ప్రభుత్వ విధానాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై మార్గదర్శనం చేశారు. రాజకీయ ఒత్తిళ్లను అధిగమిస్తూ చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అంకితభావంతో సేవలందించే అధికారులుగా ఎదగాలని ట్రైనీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రమణమూర్తి, ఎస్ పి డి ఎస్ పి అలహరి శ్రీనివాస్, ఐటీ కోర్ సీఐ నిస్సార్ భాష, ఆర్ఐలు సురేష్ బాబు, శ్రీహరి రెడ్డి, కృష్ణయ్య, ట్రైనింగ్ సూపర్వైజర్ చిన్నబాబు, 31 మంది ట్రైన్ అధికారులు పాల్గొన్నారు.