BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 10:35 am Posted by : BHARATH PRATHINIDHI

గుంటూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పాత గుంటూరులో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు దరిశాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకులు కిలారి రోశయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ స్థాయికి చేరుకున్న వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. తనను ఆదరించిన ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ స్థాపించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమందికి అండగా నిలిచారని పేర్కొన్నారు. చిరంజీవి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లం బాజీ, చందనపు నాగరాజు, సందెపూడి వెంకటేష్, గార్లపాటి నరేష్, లక్ష్మీశెట్టి శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.